ఓటుకు నోటు ఇష్యూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తోంది. కేసులో
అడ్డంగా బుక్కయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ కస్టడీలో జైలు ఊచలు
లెక్కబెడుతున్నాడు. ఇదే టైంలో మరో ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలకు ఏసీబీ
నోటీసులు ఇచ్చి విచారిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వేం
నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. కాసేపట్లో కేసులో
కీలకంగా మారిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని రికార్డు
చేయనుంది ఏసీబీ. స్టీఫెన్సన్ తో పాటు ఆయన కూతురు జెస్సికా, ఇంటి ఓనర్
మాల్కం టేలర్ సాక్ష్యాన్ని నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ ముందు రికార్డు
చేయనున్నారు. అటు కేసులో A1 నిందితుడు రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
పడింది. ఈ నెల 24 న పిటిషన్ ను విచారించనుంది హైకోర్టు. కేసులో ఇంకా
దర్యాప్తు కొనసాగుతున్నందున బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ తరపు లాయర్లు
వాదించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి ఆదేశించింది రాష్ట్ర
అత్యున్నత న్యాయస్థానం.
ఓటుకు నోటు ఎపిసోడ్ లో ఏసీబీ దూకుడుతో కేసుకు సంబంధమున్న నేతలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏసీబీ ఎవరికి నోటీసు ఇస్తుందో….. ఎవరిని అరెస్ట్ చేస్తుందో అర్థంకాక టెన్షన్ పడుతున్నారు. ఇక ఆరోపణల నుంచి బయటపడేందుకు ఏపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అవకాశమున్న ప్రతీ దారిని వెతుకుతున్నారు. కేసులో కీలక నేతలకు ఏసీబీ నోటీసులిస్తుందన్న సమాచారంతో అలర్టయ్యారు లీడర్స్. సెక్షన్ 8 ని తెరపైకి తెచ్చినా అది వర్కవుట్ కాకపోవడంతో గవర్నర్ పై ఎదురుదాడి చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అటు ఢిల్లీ నుంచి కేంద్రమైనా సాయంచేస్తుందన్న ఆశలు ఆవిరవుతున్నాయి. మొన్నటి ఢిల్లీ టూర్లో ప్రధాని మొదలు హోంమంత్రి, ఆర్థికమంత్రి ఇతర నేతలను కలిసి మొరపెట్టుకున్నా తామేమీ చేయలేమని చెప్పినట్టు తెలుస్తోంది. సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన తర్వాత చేసేందేం లేదని కేంద్రం సైలెంట్ గా సైడ్ అయిపోయినట్టు టాక్. అటు ఈ ఎపిసోడ్ లో హోంశాఖ కార్యదర్శి చూసుకుంటారని స్వయంగా చెప్పేశారు రాజ్ నాధ్ సింగ్. దీంతో కేంద్రం వైఖరి స్పష్టంగా వెల్లడైంది.
Source By V6..
ఓటుకు నోటు ఎపిసోడ్ లో ఏసీబీ దూకుడుతో కేసుకు సంబంధమున్న నేతలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏసీబీ ఎవరికి నోటీసు ఇస్తుందో….. ఎవరిని అరెస్ట్ చేస్తుందో అర్థంకాక టెన్షన్ పడుతున్నారు. ఇక ఆరోపణల నుంచి బయటపడేందుకు ఏపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అవకాశమున్న ప్రతీ దారిని వెతుకుతున్నారు. కేసులో కీలక నేతలకు ఏసీబీ నోటీసులిస్తుందన్న సమాచారంతో అలర్టయ్యారు లీడర్స్. సెక్షన్ 8 ని తెరపైకి తెచ్చినా అది వర్కవుట్ కాకపోవడంతో గవర్నర్ పై ఎదురుదాడి చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అటు ఢిల్లీ నుంచి కేంద్రమైనా సాయంచేస్తుందన్న ఆశలు ఆవిరవుతున్నాయి. మొన్నటి ఢిల్లీ టూర్లో ప్రధాని మొదలు హోంమంత్రి, ఆర్థికమంత్రి ఇతర నేతలను కలిసి మొరపెట్టుకున్నా తామేమీ చేయలేమని చెప్పినట్టు తెలుస్తోంది. సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన తర్వాత చేసేందేం లేదని కేంద్రం సైలెంట్ గా సైడ్ అయిపోయినట్టు టాక్. అటు ఈ ఎపిసోడ్ లో హోంశాఖ కార్యదర్శి చూసుకుంటారని స్వయంగా చెప్పేశారు రాజ్ నాధ్ సింగ్. దీంతో కేంద్రం వైఖరి స్పష్టంగా వెల్లడైంది.
Source By V6..
0 comments:
Post a Comment