2005 ముందు ముద్రించిన వెయ్యి, ఐదు వందల నోట్లు సహా ఇతర కరెన్సీ నోట్లను
బ్యాంకుల్లో మార్చేదుకు కేవలం పదిరోజులు మాత్రమే మిగిలాయి. వీటిని
మార్చుకునేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన గడువు ఈనెల 30తో
అయిపోతుంది. 2005 కన్నా ముందు ముద్రించి, చెలామణిలో ఉన్ననోట్లను వెనక్కి
తెప్పించేందుకు, వాటిని బ్యాంకుల్లో మార్చుకోవాలని ప్రజలకు ఆర్బీఐ
సూచించింది.
ఈ ఏడాది జనవరి 1ని గడువుకు ఆఖరు తేదీగా నిర్ణయించినా.. ఆ తర్వాత జూన్ నెలాఖరు వరకు పొడిగించింది.
2005 ముందు ముద్రితమైన నోట్లను గుర్తించడటం ఎంతో సులభం. ఈ నోట్లకు వెనుకవైపు.. ముద్రిత సంవత్సరం ఉండదు. దొంగ నోట్ల చెలామణి నిరోధించేందుకు ఈ నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ అంటోంది. 2005కు ముందు నోట్లకు భద్రతాప్రమాణాలు తక్కువగా ఉండటమే దీనికి కారణమని.. ఆర్బీఐ వర్గాలంటున్నాయి.
ఈ ఏడాది జనవరి 1ని గడువుకు ఆఖరు తేదీగా నిర్ణయించినా.. ఆ తర్వాత జూన్ నెలాఖరు వరకు పొడిగించింది.
2005 ముందు ముద్రితమైన నోట్లను గుర్తించడటం ఎంతో సులభం. ఈ నోట్లకు వెనుకవైపు.. ముద్రిత సంవత్సరం ఉండదు. దొంగ నోట్ల చెలామణి నిరోధించేందుకు ఈ నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ అంటోంది. 2005కు ముందు నోట్లకు భద్రతాప్రమాణాలు తక్కువగా ఉండటమే దీనికి కారణమని.. ఆర్బీఐ వర్గాలంటున్నాయి.
0 comments:
Post a Comment